సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్, SSB డాక్టర్ సుజోయ్ లాల్ థాసేన్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ థాసేన్ 1988 బ్యాచ్, మధ్యప్రదేశ్ కేడర్ కు చెందిన IPS అధికారి. ఐపీఎస్ సంజయ్ అరోరా డాక్టర్ థాయోసెన్కు బాధ్యతలను అప్పగించారు.
1984 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి రాకేష్ అస్థానా పదవీ విరమణ చేయడంతో కేంద్ర ప్రభుత్వం నిన్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా 57 ఏళ్ల సంజయ్ అరోరాను నియమించింది.
మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన IPS అధికారి అయిన థాసేన్ ఇటీవలే సశాస్త్ర సీమా బల్ (SSB) DG గా నియమితులయ్యారు. జూన్ 1న నేపాల్-భూటాన్ సరిహద్దుల రక్షణ దళానికి బాధ్యతలు చేపట్టారు.
1962లో స్థాపించిన ITBP ఇండో-చైనా సరిహద్దులను కాపాడుతుంది. ఇది ఛత్తీస్గఢ్ లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలతో పాటు వివిధ అంతర్గత భద్రతా విధుల్లో కూడా మోహరించి ఉంది. దాదాపు 90,000 మంది సిబ్బందితో కూడిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) ప్రధానంగా చైనాతో కలిసి ఉన్న 3,488 కిలోమీటర్ల పొడవైన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)కి రక్షణగా ఉంది.