శ్రీలంక సంక్షోభం ముదురుతోంది. పరిస్థితి మరింత అదుపు తప్పడంతో ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణిల్ విక్రమసింఘే రాజీనామా చేశారు.అమాంతం పెరిగిన ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడం ప్రభుత్వం వల్ల కావడం లేదు. దీంతో ప్రజలు ఆగ్రహంతో రోడ్లమీదకు వచ్చారు.వేలాదిగా వెళ్లి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇల్లు ముట్టడించారు.అయితే నిఘావర్గాలు ముందుగానే సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడినుంచి ముందే తప్పించుకున్నారు. ఆయన లేకపోయినా నిరసనకారులు ఇంట్లోకి చొరబట్టారు.
అటు రణిల్ విక్రమసింఘే నివాసం వద్ద భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఆల్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడాల్సిన అవసరం ఉందని రాజీనామా అనంతరం విక్రమ సింఘే అన్నారు. ప్రధానమంత్రి రాజీనామా చేసిన వెంటనే కేబినెట్ మంత్రి బండుల గుణవర్ధనె కూడా తన పదవికి రాజీనామా చేశారు.