
(Left) Sri Lankan president Gotabaya Rajapaksa and prime minister Mahinda Rajapaksa.
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. మహీంద రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక ప్రభుత్వం పార్లమెంటులో మెజారిటీని కోల్పోయింది. సొంతపార్టీ ఎంపీలు, మిత్రపక్షాలతో కలిసి బయటకు పోవడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది.
శ్రీలంక పార్లమెంటులో 225 మంది సభ్యులు ఉన్నారు ప్రభుత్వం కొనసాగాలంటే 113 మంది సభ్యుల మద్దతు ఉండాలి. ప్రస్తుతం అధికార పార్టీకి 117మంది ఎంపీలున్నారు. . ప్రతిపక్ష ఎస్జేబీకి 54 మంది సభ్యులు, టీఎన్ఏకి 10 మంది సభ్యులు ఉన్నారు. ఇతరులు 15 మంది ఉన్నారు. అయితే ప్రస్తుతం ఫిరాయింపుల వల్ల ఆ పార్టీ బలం 105కు పడిపోయింది. మొత్తం అసమ్మతివాదుల సంఖ్య 41కి చేరింది. వీరిలో అధికార పార్టీ సభ్యులు కూడా ఉన్నారు. అసమ్మతివాదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో ప్రజలు రాజపక్సే పాలనపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నియమించడం రాష్ట్రపతి ముందున్న పని. దీంతో ఆయన ఆధిక్యతను నిరూపించుకోవాలంటూ పార్టీలకు ఆహ్వానాలు పంపారు. అటు ఈ పరిణామాల ప్రభావం గొటబయ రాజపక్సపైనా పడే అవకాశం కనిపిస్తోంది. ఆయనా రాజీనామా చేయాలనే డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నాయి.