ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో మహిళపై దాడికి పాల్పడి పరారీలో ఉన్న శ్రీకాంత్ త్యాగి నిన్న మీరట్ లో పట్టుబడ్డాడు. పరారీలో ఉన్నప్పుడు అతను తన వెంట ఉన్నవారిని తప్పించుకోవడానికి 15 సార్లు వాహనాలను మార్చినట్లు సమాచారం.
నాలుగు రోజుల వ్యవధిలో త్యాగి మూడు రాష్ట్రాలలో పోలీసులను ఛేజింగ్ చేయించాడు. నోయిడా నుంచి ఢిల్లీ వరకు వెళ్ళాడు. హరిద్వార్లో కొంత సమయం పాటు బస చేసాడు.
పోలీసులు అతన్ని హిల్ స్టేట్ లో పట్టుకునేలోపే అతను యూపీలోని సహరాన్ పూర్ కు తప్పించుకున్నాడు. ఆపై బాగ్పట్, మీరట్ చేరుకున్నన్నాడు. అక్కడ అతని సన్నిహితుడి దగ్గర దాక్కున్నాడు.
శుక్రవారం నోయిడా నుంచి పారిపోయిన త్యాగి నేరుగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ అతను ఆ రాత్రి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే సమయానికే.. నోయిడా హౌసింగ్ సొసైటీలో నివాసముంటున్న ఒక మహిళను దుర్భాషలాడడం, అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వైరల్ గా మారింది. అరెస్టు భయంతో అతను విమానాశ్రయంను విడిచిపెట్టి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. నోయిడా పోలీసుల ఎనిమిది బృందాలు సహా యూపీ ఎస్టీఎఫ్ త్యాగిని వెంబడించాయి.
కార్లు మాత్రమే కాదు, త్యాగి పోలీసులకు చిక్కకుండా ఉండటానికి మొబైల్ ఫోన్ లతో పాటు ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను కూడా మార్చాడు.