నాటి లంకా దహనాన్ని ఎవరూ చూడలేదు కానీ ప్రస్తుతంమాత్రం శ్రీలంక దహించుకుపోతోంది.ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన నడుమ ప్రధాని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మహింద రాజపక్సే రాజీనామా చేసిన కాసేపటికే సాక్షాత్తూ అధికార పార్టీ SLPP కి చెందిన ఎంపీ అమరకీర్తి అతుకోరల ఆ హింసలో చనిపోయారు. ప్రధాని మహింద రాజపక్సే తన పదవికి రాజీనామా చేసిన కాసేపటికే ఈ ఘోరం జరిగింది. నిట్టంబువాలో ఆందోళనకారులు అతుకోరల కారును అడ్డుకున్నారు. ఆ సమయంలోఆందోళనకారులపైకి ఎంపీ జరిపిన కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. ఎంపీ వారినుంచి తప్పించుకోబోతూ సమీపంలోని భవనంలోకివెళ్లారు. అయితే కాసేపటికే ఎంపీ, ఆయన మృతదేహం కనిపించింది. ఎంపీది హత్య కాదని ఆయనే ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో ఉన్న కొందరు ఎంపీపై దాడి చేయడంతో ఆయనే కాల్చుకుని చనిపోయారని శ్రీలంక మీడియా కథనం. ఎంపీ డ్రైవర్ కూడా ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు.
తాజా ఘర్షణలపై విపక్షనేత సజిత్ ప్రేమదాస ఆందళన వ్యక్తం చేశారు. రాజపక్స కుటుంబం వల్లే దేశానికీ గతి పట్టిందని విమర్శించారు. ఆందోళనకారులను, మీడియోను దెబ్బతీయాలని అధికారపార్టీ చూస్తోందని..అదే జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వ వ్యతిరేక పోస్టర్లు, బ్యానర్లే కనిపిస్తున్నాయి శ్రీలంక అంతటా. దీంతో అధికార పార్టీ అనుకూలురు వారిమీద ప్రతిఘనటకు దిగారని తెలుస్తోంది. మహిళలు, పిల్లలు, వృద్ధులతో సహా చాలా మంది ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు గాయపడినట్లు సమాచారం. కనీసం 78 మంది గాయపడ్డారు, వారిని కొలంబో జాతీయ ఆసుపత్రిలో చేర్చారు. హంబన్టోటాలోని రాజపక్సల కుటుంబ ఇల్లుతో సహా అనేక ఇళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. కేవలం రాజపక్స కుటుంబ ఇంటికే కాదు, సనత్ నిశాంత, ఎంపీలు, మేయర్లు, రాజకీయ నాయకులు సహా పలువురు ఇతర మంత్రుల ఇళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు.
శ్రీలంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సోమవారం మహీంద్ర రాజపక్స తన రాజీనామాను తన తమ్ముడైన రాష్ట్రపతి గోటబయ రాజపక్సకు అధికారికంగా అందచేశారు. సంయమనం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసినా ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి.