ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది శ్రీలంక. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ కొరతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఏ బంకు దగ్గర చూసినా వందలాది వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. దీంతో ఆగ్రహంతో ఊగిపోతున్న వాహనదారులు ఆందోళనలకు దిగుతున్నారు. ధర్నాలు చేస్తున్నారు. దీంతో పరిస్థితిని అదుపుచేసే క్రమంలో కేంద్రం సైన్యాన్ని మోహరించింది.
విద్యుత్ సరఫరాకు తీవ్ర ఇబ్బంది అవుతోంది. వంట గ్యాస్ కూడా అందుబాటులో లేక ప్రజలు నరకం చూస్తున్నారు. కిరోసిన్ కూడా దొరకకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు కొలంబో ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. స్థానికుల ఆందోళనలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సంక్షోభాన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిసింది. అక్రమంగా పెట్రోల్, కిరోసిన్, ఇతర నిత్యావసరాల్ని బ్లాక్ చేశారు. దీంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)