అటు శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. దేశంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం క్రమక్రమంగా ఆందోళనలకు దారితీసింది. నిరసనకారుల ఆందోళనలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఇక ప్రధాని మహింద రాజపక్సే రాజీనామా తరువాత పరిస్థితులు మరింత అధ్వానంగా మారాయి. ఏకంగా అధికార పార్టీఎంపీమీదనే నిరసనకారులు దాడికి దిగారు. ఆయన జరిపిన కాల్పుల్లో పలువురికి గాయాలయ్యాయి. కాసేపటికే అనుమానాస్పద స్థితిలో ఆ ఎంపీ మృతదేహాన్ని గుర్తించారు. రాజపక్సె మద్దతుదారులు, వ్యతిరేకులకు మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. దీంతో మిలిటరీరంగంలోకి దిగాల్సివచ్చింది. పరిస్థితులను అదుపుచేసేందుకు మిలిటరీకి, పోలీసులకు అత్యవసర అధికారాలు అప్పగిస్తూ ఆ దేశం నిర్ణయం తీసుకుంది. ఘర్షణల్లో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. పరిస్థితి అదుపుతప్పుతోందని భావించిన శ్రీలంక ఈ ఎమర్జెన్సీని ప్రకటించింది.