భువనేశ్వరీ పీఠాధిపతిగా పరివ్రాజకాచార్య శ్రీ కమలానంద భారతీ స్వామి పట్టాభిషక్తులయ్యారు. విజయవాడ సమీపంలోని గన్నవరంలో జరిగిన కార్యక్రమంలో కూర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వర భారతీ స్వామీజీ, సంఘ్ , విశ్వహిందూ పరిషత్ ముఖ్యులు హాజరయ్యారు. 2025లో ఆర్ఎస్ఎస్ వందేళ్ల ఉత్సవాల్లో భువనేశ్వరీ పీఠం భాగమవుతుందని కమలానందభారతీస్వామి అన్నారు.