అవి ప్రాచీన నమ్మకాలు కావచ్చు, దేశీయ ఔషధాలు అంటే ఆయుర్వేదం వంటివి కావచ్చు, హోమియో కావచ్చు ఆఖరికి అల్లోపతి మందులు, వైద్యం పై కూడా.
ఏ చికిత్సఆయినా పనిచేయడానికి కాస్త నమ్మకం కావాలి. దాన్నే అందరం కట్టకట్టుకు చంపేస్తున్నాం.
రోగికి తను వేసుకుంటున్న మందు మీద చికిత్స చేస్తున్న వైద్యుని మీద పూర్తి నమ్మకం ఉంచుకోవాలి అన్నది ప్రాధమిక సూత్రం.
ఔషధాల మీద, ట్రీట్ మెంట్స్ విధానాల మీద ఏ మాత్రం అవగాహన లేని ప్రతీ వాడు వైద్య శాస్త్రంలో ఎక్స్పర్ట్స్ లాగా ఉచిత సలహాలు ఇవ్వడం, సమాజంలో భయాలు రేకెత్తించడం.
అల్లోపతి మందులు కూడా కొన్ని కండిషన్స్ కి లోబడి పనిచేస్తాయి..ఒకే మందు అందరి రోగుల మీదా ఒకే విధంగా పనిచేసే అవకాశమే లేదు. కారణం ప్రతీ జీవి ఒక ప్రత్యేకత కలిగి ఉంటాడు. అందుకని ఒకడికి పని చేసింది వేరొకడికి పనిచేయలేదు. అందువల్ల ఆ ఔషధం మోసం అని చెప్పలేం.
క్లినికేల్ ట్రాయిల్స్ కూడా కొన్ని పరిమితులు
లోబడే చేయగలుగుతారు. రోజురోజుకూ ఇంకా గట్టిగా చెప్పాలంటే క్షణ క్షణానికి మారే మానవ శరీరం మీద ఒకే మందు అన్ని సమయాల్లో అందరికి అంటే బయటకు కనిపించే లేదా కనిపించని రకరకాల రోగాలతో ఉండే మానవులు అందరికి ఒకే విధంగా పనిచేసే అవకాశం లేదు.
అలాగే అందరి ఇమ్మునిటీ ఒకే విధంగా ఉండదు
కొందరికి ఆ మందు పనిచేయలేదు అంటే చాలా కారణాలు ఉంటాయి.
ఇప్పటికే వున్న వైరస్ లు గాని, రాబోయే వైరస్ లు.కానీ అలా రూపాంతరం చెందుతూనే ఉంటాయి..అలాగే
మనుషులు. కూడా మార్పుచెందుతూనే వుంటారు. క్లినికేల్ ట్రైల్స్ అంటే ఎప్పుదూ మారుతూ ఉండే రెండు వేరియబుల్స్ తో డీల్ చెయ్యడం అన్న మాట.
అందుకే ఈ కరోనా కష్ట సమయంలో మందుల మీద వైద్యుల మీద, ఆసుపత్రుల మీద, వైద్య విధానాల మీద అపనమ్మకం కలిగించకండి. వాటి గురించి స్టడీ చేసి కాలానుగుణంగా హెచ్చరించే సంస్థలకు ఆ పని వదిలేద్దాం.
సమాజం లో కొంత శాతం అవినీతితో నిండిపోయి బ్రష్టుపట్టిపోయిఉంది. డాక్టర్లు కూడా ఈ సమూహం నుండే వస్తారు కాబట్టి వారిలో కొందరు ధూర్తులు ఉంటారు. వారిని కోట్ చేస్తూ అందరి వైద్యులను అవమానించకండి.
ఈ కరోనా సమయం లో ప్రాణ భయంతో తండ్రి కొడుకు, భార్య భర్త. ఇలా ఉన్నత సంబంధాలు ఉన్నవారే తమ వారిని పట్టించుకోలేని, చూడలేని దౌర్భాగ్య స్థితి లో ఉన్నాం.
కరోనా వల్ల దేశం ఇప్పటికే కొన్ని వందల డాక్టర్లను. కోల్పోయింది. మనకంటే ప్రాణాలు రిస్క్ వారికి ఎక్కువ.. ప్రాణ భయంతో మన లాగే వారూ ఇంట్లో కూర్చుంటే మన పరిస్థితి ఏమిటి? ఆలోచించండి..
…చాడా శాస్త్రి..