
అన్నిట్లో ఎప్పుడూ భిన్నంగా వుండే బీహార్ ఈ స్టార్ట్ అప్స్ విషయం లోనూ తన ప్రత్యేకతను చాటుకుంది.
ఎలా అంటే సుధీర్ మిశ్రా అనే వాడు బీహార్ లో చాప్రా పట్టణంలో నలుగురి కి ఉపాధి ఏర్పాటు చేసే విధంగా ఒక స్టార్ట్ అప్ ని ట్రైనింగ్ సెంటర్ రూపంలో ప్రారంభించాడు. వివిధ రాష్ట్రాల నుండి యువకులను ఆహ్వానించి వారికి 3నెలల క్రాష్ కోర్సు నేర్పించి 15 రోజులు లైవ్ డెమో ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడు.. ఈ ట్రైనింగ్ విజయవంతం గా పూర్తి చేసిన వారికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాడు.
ఇంతకీ ఈ ట్రైనింగ్ దేనికో చెప్పలేదు కదూ!
ఏం లేదు. ఏదైనా ATM లోకి ప్రవేశించి, పట్టుబడకుండా ఎటిఎం అద్దాల మీద సీసీటీవీ కెమెరాల మీద పొగమంచు లాంటి దానిని స్ప్రే చేసి, ఎటిఎం బద్ధలు కొట్టి, నగదు తీసుకుని జస్ట్ 15 ని.లలో బయట పడటం ఎలా అనేదే ఈ ట్రైనింగ్. ఇలా జస్ట్ 15ని.లలో బయట పడే స్కిల్ ఉన్న వారిని మాత్రమే ఫీల్డ్ లోకి పంపిస్తాడు.
ఈ విషయం బీహార్ పోలీసులు కనిపెట్టలేదు. పక్క రాష్ట్రం అయిన యుపి పోలీసులు కనుక్కున్నారు. ఎలా అంటే, లక్నోలో గోల్ఫ్ సిటీ దగ్గర ఎటిఎం లో చోరీ జరిగి ₹39.58 లక్షల కాష్ పోయింది. దొంగలను పట్టుకోడానికి యూపీ పోలీసులు ఎటిఎం చుట్టుపక్కల, నగరం లో ఉన్న 1000 సీసీటీవీ ఫూటేజ్ లు, మరియు లక్నో పట్టణంలో కి వచ్చే దారుల దగ్గర ఉన్న 20 సీసీటీవీ ఫుటేజ్ లు చూస్తే ఒక నీలం కారుపై అనుమానం వచ్చి ఆ కార్ ని పట్టుకున్నారు. దానిలో నలుగురు యువకులు ₹9.18 లక్షల కాష్ దొరికింది.
వారిని పట్టుకుని విచారిస్తే ఈ మిశ్రా ట్రైనింగ్ సెంటర్ సంగతి బయట పెట్టారు. ఈ మిశ్రా దగ్గర ట్రైనింగ్ పొందిన వారు గత సం. కాలంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో 30వరకు ఎటిఎం లు కొల్లగొట్టారుట.
అలాగే చూడండి ఫేక్ మొబైల్ కాల్స్, SMS లు ద్వారా మన బాంక్ ఎకౌంట్స్ లో డబ్బులు కొట్టేసే బాచ్ లు కూడా చాలా వరకు బీహార్ నుండే తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ వుంటారు.
అన్ని రాష్ట్రాలు కొద్దో గొప్పో బాగుపడుతున్నాయి కానీ బీహార్ గాడిలో పడటం లేదు.
….చాడా శాస్త్రి….