ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఇచ్చోడ సర్కిల్స్ లో సీఐ నైలు ఆధ్వర్యంలో యువతకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. వివేకానంద జూనియర్, డిగ్రీ కాలేజీలో జరిగిన ఈ శిక్షణాశిబిరానికి పెద్దసంఖ్యలో యువతీయువకులు హాజరయ్యారు. పోలీసు కావాలనే తన కలను సాకారం చేసుకునేందుకు ఉత్సాహంగా శిబిరానికి హాజరవుతున్నట్టు వారు తెలిపారు. సీఐ పర్యవేక్షణలో మూడురోజుల పాటు యువతకు సంబంధిత ఫ్యాకల్టీ ద్వారా తరగతులు నిర్వహించారు. నేటి యువత పట్టుదల ఉంటే దేన్నైనా సాధిస్తారని..శిక్షణకు హాజరైన వారంతా కానిస్టేబుల్, ఎస్సై పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారని ఆకాంక్షించారు సీఐ నైలు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)