సంచలన ప్రకటన చేశారు బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్. 2024 ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి అధికారంలోకి వస్తే వెనకబడిన అన్ని రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.బీజేపీతో ఇటీవలే బంధాన్ని తెంచుకున్న నితీష్ మరింత వేగం పెంచారు. బీజేపీయేతర పక్షాలను కలిపే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా..ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి,రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఐఎన్ఎల్డీ నేత చౌతాలా, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్తోనూ చర్చలు జరిపారు. కొన్నిరోజుల్లో ఆయన సోనియాను కలిసే అవకాశం ఉందని సమాచారం. బీజేపీని వీడిన నితీష్…ఆర్జేడీ, కాంగ్రెస్ తో కూడిన సంకీర్ణ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చేసిన తాజా హామీ చర్చనీయాంశం అయింది.