బెంగళూరులోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) సహా కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ రీసెర్చ్ (KIER) పరిశోధకుల బృందం మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం పాదరక్షల సెట్ను తయారు చేసింది.
మధుమేహం ఉన్న వ్యక్తులలో పాదాల గాయాలు ఆరోగ్యకరమైన వ్యక్తుల కంటే నెమ్మదిగా నయం అవుతాయి, ఇది ఇన్ఫెక్షన్ అవకాశాన్ని మరింత పెంచుతుంది. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో తీసేయాల్సిన పరిస్థితులకు దారితీయవచ్చు.
పరిశోధకులు అభివృద్ధి చేసిన కొత్త పాదరక్షలు 3D ప్రింటెడ్. ఒక వ్యక్తి పాదాల కొలతలు, నడక శైలికి అనుకూలీకరించవచ్చు. పాదాలను బాగా సమతుల్యంగా ఉంచే స్నాపింగ్ మెకానిజం ఇందులో ఉంది. గాయపడిన ప్రాంతం వేగంగా నయం చేయడం.. గాయాలు తలెత్తకుండా నిరోధించడం దీని ప్రత్యేక పనితనం. డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతికి ఇవి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తున్నారు.
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సాధారణంగా తమ మడమను ముందుగా నేలపై ఉంచుతారు, తరువాత పాదం, కాలివేళ్లు. ఈ నడక చక్రం ఒత్తిడిని పాదం అంతటా సమానంగా పంపిణీ చేస్తుంది. కానీ చలనాన్ని కోల్పోవడం వల్ల మధుమేహం ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ ఈ క్రమాన్ని అనుసరించకపోవచ్చు, అంటే ఒత్తిడి అసమానంగా పంపిణీ అవుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉండే పాదాల ప్రాంతాలలో అల్సర్లు, కార్న్స్, కాలిస్లు సహా ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పాదరక్షలు ఒత్తిడిని తట్టుకోవడానికి ఉపయోగపడతాయని పరిశోధకులు వివరించారు.
ఈ బృందంలో జి.కె. అనంత సురేష్, ప్రియబ్రత మహారాణా, IIScకి చెందిన జ్యోతి సోనావానే సహా KIERకి చెందిన పవన్ బెలేహల్లి లు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్కి చెందిన వేరబుల్ టెక్నాలజీస్ అనే సైన్స్ జర్నల్లో వారు తమ అధ్యయనంపై ఒక నివేదికను ప్రచురించారు. వారు తమ ఉత్పత్తిని వాణిజ్యీకరించడానికి స్టార్టప్లు ఫుట్ సెక్యూర్, యోస్ట్రా ల్యాబ్లతో సహకరిస్తున్నారు.