అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు తలెత్తుతున్న నేపథ్యంలో అల్లర్లకు మరింత ఆజ్యం పోసేలా ఉంది సమాజ్ వాదీ పార్టీ తీరు. ఆ పార్టీ నాయకురాలు రచనా సింగ్ ఓ ఫ్యాక్టరీ పేలుడు బాధితులను అగ్నిపథ్ అల్లర్ల బాధితులుగా చూపే ప్రయత్నం చేసింది. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని..ఆశను కోల్పోవద్దని. ఆర్మీలో చేరడానికి ఆసక్తి ఉన్న జీవితాలతో మోదీ ప్రభుత్వం ఆడుకుంటోందని…తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానంటూ ట్వీట్ చేసింది.
అందులో ఒంటినిండా రక్తం గాయాలతో ఉన్న యువకుల చిత్రాలను పోస్ట్ చేసింది. ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్ పథకంతో నిరాశ చెందిన తర్వాత వారు ఆత్మహత్యా యత్నం చేశారని సూచించింది. వివాదాస్పద ట్వీట్ ను నెటిజన్లు 249 సార్లు షేర్ చేశారు, 787 మంది లైక్ చేసారు. అయితే అది ఫేక్ అని తేలడంతో దాన్ని తొలగించారు.
ఆమె రిలీజ్ చేసిన ఫోటోలలో రెండవ ఫోటోపై టైమ్ స్టాంప్ ‘2022/6/4 14: 44’ అని ఉంది. ఈ ఏడాది జూన్ 4 మధ్యాహ్నం 2:44 గంటలకు అది క్యాప్చర్ అయింది. అసలైతే భారత సాయుధ దళాలలో రిక్రూట్మెంట్ కోసం అగ్నిపథ్ స్కీమ్ జూన్ 14, 2022న ప్రకటించారు. ఆ ఫొటోలు అందుకు సంంబంధించినవి కావని స్పష్టమైంది.
https://twitter.com/TheUPNews/status/1534126807833665537?s=20&t=DOPde7Mr4xmyhrdx3BhI8w
ఓ ట్విటర్ యూజర్ (@Befitting Facts) ప్రకారం, బాధితులకు ఆత్మహత్య చేసుకునే సమయంలో గాయాలు కాలేదు, ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో ఒక రసాయన కర్మాగారంలో పేలుడు సంభవించినప్పుడు కొందరు గాయపడ్డారు. వారి ఫొటోలను అగ్నిపథ్ స్కీం బాధితులుగా దేశాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు రచనా సింగ్.