ఆపరేషన్ సింధూర్ ను భారత సైనిక బలగాలు సక్సెస్ చేశాయి. అర్థ రాత్రి నిశ్శబ్దంగా పాకిస్థాన్ లోకి చొరబడి, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశాయి. వంద మందికి పైగా టెర్రరిస్టులను చీకట్లోనే లేపేశాయి. అందులో కరడుకట్టిన టెర్రరిస్ట్ నాయకులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సింధూర్ విజయాలను మీడియాకు సైనిక అధికారులు కల్నర్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు.
….
ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం గమనించాలి. ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎంచుకోవటానికి ప్రత్యేకమైన కారణం ఉంది. పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడిచేసి అమాయకులైన టూరిస్టులను చంపేశారు. సుమారు 28 మంది మహిళల నుదుటి సింధూరాన్ని నిర్దాక్షిణ్యంగా చెరిపేశారు. మతం పేరు తెలుసుకొని మరీ చంపేసి పారిపోయారు. ఇది భారతీయ మహిళలకు జరిగిన అవమానంగా భావించాలి.
…
దీనిని దృష్టిలో పెట్టుకొని ఉగ్రవాదులను వెంటాడి వెంటాడి చంపేయాలని భారత్ నిర్ణయించుకొంది. పొరుగు దేశంలో ఉగ్రవాద స్థావరాలను గుర్తించి రాత్రికి రాత్రే ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. కేవలం ఉగ్రవాదులనే టార్గెట్ చేసుకొని, వంద మంది టెర్రరిస్టులను హతమార్చింది. ఇది సైనిక బలగాలు, మన భారతీయ మహిళలకు అందించిన కానుక
..
ఈ కానుకలను సైనిక బలగాలకు చెందిన ఇద్దరు మహిళా ఆఫీసర్లు సోఫియా ఖురేషి, వ్యోమికాసింగ్ అందించారు. భారతీయ మహిళలు అంటే అబలలు కాదు, సబలలు అని నిరూపించారు. పాకిస్తాన్ దమ్ముంటే కాస్కో అంటూ ఈ ఇద్దరు సివంగులు గర్జించారు. భారతీయుల పౌరుషాన్ని అంతర్జాతీయ సమాజానికి చాటి చెప్పారు.
..
కల్నల్ ఖురేషి సైన్యం పట్ల మక్కువ తో ఆర్మీలో ప్రవేశించారు. 1990 లో ఆఫీసర్ గా సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2006 లో కాంగో శాంతి బలగాల్లో ఆమె చూపిన ధైర్య సాహసాలకు ఎన్నెన్నో అవార్డులు అందుకొన్నారు. ప్రస్తుతం కల్నర్ ర్యాంక్ లో భారతీయ సైనిక బలగాలను నడిపిస్తున్నారు. ఇక, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చాలా ధైర్య సాహసం కలిగిన యువతి. చేతక్ విమానాలతో చిచ్చరపిడుగులా చెలరేగిపోవటం ఆమె నైజం. 2004 నుంచి భారతీయ వైమానిక దళంలో పనిచేస్తూ ఎన్నెన్నో మెడల్స్ అందుకొన్నారు.
…
ఇప్పుడు ఈ ఇద్దరు శివంగిలు.. భారతీయ మహిళల ఆత్మాభిమానాన్ని లోకానికి చాటి చెప్పారు. వాస్తవానికి ఈ యుద్దంలో పాల్గొన్న సైనికుల్లో కూడా మహిళలు ఉన్నట్లు సమాచారం. కానీ సెక్యురిటీ కారణాల రీత్యా ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న సైనికుల వివరాలు బయట పెట్టడం లేదు.