కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ న్యూడిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరారు. అయితే రెగ్యులర్ చెకప్ కోసమే ఆమె ఆస్పత్రికి వెళ్లినట్టు తెలిసింది. గతేడాది సోనియా కరోనాబారిన పడ్డారు. ఆప్పుడు వారానికి పైగా ఆమె ఆస్పత్రిలోనే ఉన్నారు.నాటినుంచి పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. కొన్ని నెలల క్రితం వైద్యపరీక్షల కోసం ఆమె విదేశాలకూ వెళ్లి వచ్చారు. కొన్ని నెలలుగా యాక్టివ్ గానే తిరుగుతున్న సోనియా…రాహుల్ భారత్ జోడో యాత్రలో కూడా అడపాదడపా కనిపిస్తున్నారు. కర్నాటక, ఢిల్లీలో రాహుల్ తో కలిసి ఆమె కొద్దిసేపు నడిచారు కూడా.