నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ముఖ్యులు సోనియా,రాహుల్ కు ఈడీ సమన్లు జారీచేసింది. 2015లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మూసివేసిందని కాంగ్రెస్ పేర్కొంటున్న నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గాంధీలకు సమన్లు పంపింది. అయితే బీజేపీ కక్షసాధింపు చర్యలో భాగమే సమన్లు అని ఈడీ మండిపడింది. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు బీజేపీ కీలుబొమ్మలను ఉపయోగిస్తోందని…. నేషనల్ హెరాల్డ్ కు ఎంతోచరిత్ర ఉందని పార్టీ నేత అభిషేక్ మను సింఘ్వి అన్నారు. మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా సహా ప్రతిపక్ష నాయకులందరూ దాడులకు గురవుతున్నారని అన్నారు. అన్ని కంపెనీలు రుణాలను ఈక్విటీలుగా మార్చడం ద్వారా బ్యాలెన్స్ షీట్ను మెరుగుపరుస్తాయని సింఘ్వీ తెలిపారు.
“నేషనల్ హెరాల్డ్ కేసును ED 2015లో మూసివేసింది. కానీ ప్రభుత్వం సంబంధిత ED అధికారులను తొలగించి.. కొత్త అధికారులను తీసుకువచ్చి.. కేసును మళ్లీ తెరిచింది. ఇది ద్రవ్యోల్బణం, ఇతర పెరుగుతున్న సమస్యల నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నం” అని సింఘ్వీ అన్నారు.
అధికార పార్టీ కుట్రలకు భయపడబోమని అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసు ఈక్విటీ లావాదేవీలో ₹2,000 కోట్లకు పైగా ఆస్తుల దుర్వినియోగానికి సంబంధించింది.
కొద్దిరోజుల క్రితం గాంధీలకు నోటీసులు అందాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ విచారణకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి పవన్ బన్సాల్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేలను ఏప్రిల్లో ఈడీ ప్రశ్నించింది.