ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాంధీతో భేటీఅయ్యారు. ఢిల్లీలో సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీలో పార్టీ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, అంబికా సోనీ, దిగ్విజయ సింగ్, మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నట్టు సమాచారం. గతనెలలో ఆయన రాహుల్, ప్రియాంకలనూ కలిసిన సంగతి తెలిసిందే. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరపరాజయంపై చర్చించినట్టు తెలుస్తోంది. సమావేశానికి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటనా ఎటువైపునుంచి రాలేదు. అయితే పీకే కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం మరోసారి జరుగుతోంది.