నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈడీ విచారణ ముగిసింది. ఈరోజు ఉదయం నుంచి 3 గంటలపాటు ప్రశ్నించాక ఈడీ కార్యాలయం నుంచి ఆమె ఇంటికి వెళ్లిపోయారు. ఈ కేసులో సోనియాను ఇప్పటి వరకు ఈడీ మూడు రోజులు విచారించింది. మొత్తం 12 గంటలపాటు సోనియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది.ఈనెల 21న 3 గంటలు, నిన్న 6 గంటల పాటు ప్రశ్నలు కురిపించారు. ఇక ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2గం.ల వరకు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇక మీదట ఈడీ కేంద్ర కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని చెప్పారని సమాచారం. కాబట్టి ప్రస్తుతానికి సోనియా విచారణ ముగిసినట్టే భావిస్తున్నారు.