మనీలాండరింగ్ కేసులో సోనియాగాంధీని ఇవాళ కూడా ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూలై 21న దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించింది ఈడీ. రెండో రౌండ్ లో భాగంగా ఇవాళ కూడా ప్రశ్నిస్తున్నారు. అటు సోనియాను ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ… ‘సంసద్ టు సడక్’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది కాంగ్రెస్. ఉదయం పార్లమెంట్ హౌస్లోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ లోక్సభ ఎంపీలందరూ సమావేశం అయ్యారు. అనుకున్నట్టుగానే సత్యాగ్రహానికి దిగారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులను తమ రాజధాని నగరంలోని ఏదైనా గాంధీ విగ్రహం వద్ద లేదా చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశం వద్ద శాంతియుతంగా సత్యాగ్రహం చేయాలని అభ్యర్థించారు.ఈమేరకు ఆయారాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.