కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఇంకా కోవిడ్ నుంచి కోలుకోలేదు. దీంతో ఈడీ విచారణకు మరింత గడువు కోరాలని పార్టీ నిర్ణయించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా ఇవాళే ఈడీ విచారణకు హాజరుకావల్సి ఉండగా గతవారం ఆమెకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అసలైతే జూన్ 2నే సోనియాతో పాటు రాహుల్ విచారణ ఎదుర్కోవాల్సి ఉండగా తాను విదేశాల్లో ఉన్నందున మరికాస్త గడువివ్వాలని రాహుల్ కోరారు. దీంతో ఈనెల 13న రాహుల్ ను విచారణకు పిలిపింది ఈడీ.