కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా వైరస్ సోకింది. వైరస్ సోకిన కొద్ది రోజులకే సోనియా ఆరోగ్యం క్షీణించడంతో జూన్ 12న ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఆమె ఆసుపత్రిలో చేరిన విషయాన్ని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా తెలియజేశారు.
https://twitter.com/rssurjewala/status/1535907879483416576?s=20&t=8iFQ0MkGPsJOhToAWDpTqw
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం జూన్ 8న విచారణకు హాజరు కావాలని సోనియాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసు పంపింది. కానీ కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కారణంగా, సోనియా గాంధీ ఈడీ నుంచి మూడు వారాల సమయం కోరారు. ఆమె ఇప్పుడు జూన్ 23న ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. ఇదే కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈరోజు(జూన్ 13)న రాహుల్ గాంధీని విచారణకు పిలిచిన దర్యాప్తు సంస్థ.. సమన్లు జారీ చేసిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ నిరసనకు సిద్ధమవుతోంది, కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో జరిగే ప్రదర్శనల ఏర్పాట్లపై చర్చించారు. ఢిల్లీ తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఈడీ కార్యాలయాల ఎదుట ‘సత్యాగ్రహం’ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో పాటు ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వరకు మార్చ్ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.