సోనాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 2003-2004 బ్యాచ్ విద్యార్థులు కార్యక్రమం నిర్వహించుకున్నారు. చదువు చెప్పిన గురువులను ప్రత్యేకంగా సన్మానించుకున్నారు. చిన్ననాటి నేస్తాలను కలుసుకుని నాటి మధురస్మృతుల్ని గుర్తు చేసుకున్నారు. వివిధ రంగాల్లో, ఎక్కడెక్కడో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా తమకు ఓనమాలు నేర్పిన బడి ఒడిలో సేద తీరారు. కుటుంబ సభ్యులను తమ చిన్ననాటి నేస్తాలకు పరిచయం చేశారు. రోజంతా ఆనందంగా ఆటా పాటలతో గడిపారు. ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా పాఠశాల రోజుల్లోకి వెళ్లిపోయామని వారంతా అన్నారు. అంతంత ఎదిగినా… ఒదిగి ఉన్న శిష్యులను చూసి గురువులూ సంతోషించారు. వారిని నిండుగా దీవించారు. తమ గురువుల వల్లే ఈ స్థాయిలో ఉన్నామని వారు నేర్పిన విలువలతోనే సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా మెలుగుతున్నామని గర్వంగా చెప్పుకున్నారు పూర్వవిద్యార్థులు. కార్యక్రమంలో ఆచార్యులు జీవన్ రెడ్డి, ఇదాపు పోషెట్టి పాల్గొన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)