ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. 6వ అంతస్తులో కేటాయించిన ఛాంబర్లో పూజల అనంతరం తొలిఫైలుపై సంతకం చేశారు.సోమేష్ కు సచివాలయ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి సోమేశ్ కృతజ్ఞతలు తెలిపారు.