కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా దేశంలోనే పవర్ ఫుల్ అధికారిగా పేరు తెచ్చుకున్న సోమనాథన్ నియమితులు అయ్యారు. తమిళనాడుకు చెందిన సోమనాథన్ ముక్కుసూటిగా వ్యవహరించే అధికారి. నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తారు అని పేరు ఉన్నది.
దేశ పరిపాలనలో క్యాబినెట్ కార్యదర్శి కీలక పాత్ర పోషిస్తుంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే దేశంలోని అధికారులు అందరికీ ఆయన బాస్ గా ఉంటారు. దేశ పరిపాలన కోసం కేంద్ర మంత్రి మండలి తీసుకొని నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఇంతటి కీలకమైన పదవి కాబట్టి అన్ని విషయాలను పరిగణాలలోకి తీసుకొని సోమనాథన్ కు అవకాశం కల్పించారు. ఈ నెల 30 నుంచి రెండేండ్ల పాటు స్వామినాథన్ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా ఉంటారు.
వృత్తి రీత్యా ఐఏఎస్ అధికారి అయిన సోమనాభం ఆర్థిక రంగ నిపుణులుగా పేరు గాంచారు. 1987 బ్యాచ్ కు చెందిన టీవీ సోమనాథన్ ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. క్యాబినెట్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టే వరకూ క్యాబినెట్ సెక్రటేరియట్లో ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)’గా విధులు నిర్వర్తిస్తారని కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ జారీ చేసిన నోటిఫికేషన్లో తెలిపింది. కేంద్ర ఆర్థికశాఖలో 2019 నుంచి వ్యయ విభాగం కార్యదర్శిగా కొనసాగుతున్న టీవీ సోమనాథన్ 2021లో ఆర్థికశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. నాటి నుంచి బడ్జెట్ తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాల డిమాండ్లలో సమతుల్యత పాటిస్తూనే బడ్జెట్లో ఆర్థిక క్రమశిక్షణకు పెద్ద పీట వేశారు.
1987 బ్యాచ్ తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన సోమనాథన్ 2015 ఏప్రిల్ నుంచి 2017 ఆగస్టు వరకూ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో పని చేశారు. గతంలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శిగా, ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ గానూ పని చేశారు.
చదువు పరంగా ఆర్థిక సంవత్సరంలో డాక్టరేట్ చేయడమే కాకుండా సిఏ, సిఎస్ కోర్సులు పూర్తిచేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ ను కాపాడిన ఆర్థిక వేత్త గా పేరు తెచ్చుకున్నారు.