అమర్ నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 11న ప్రారంభమయ్యాయి. జూన్ 30న మొదలై దాదాపు 43 రోజులు కొనసాగనున్న యాత్రకు శనివారం వరకు 33,795 మంది రిజిస్టర్ చేసుకున్నారని శ్రీ అమర్ నాథ్ ష్రైన్ బోర్డు సీఈఓ తెలిపారు. ఆన్ లైన్ లో 22229 మంది, ఆఫ్ లైన్ లో 11566 మంది రిజిస్టర్ చేసుకున్నారు. యాత్రను జూన్ 30న ప్రారంభించి.. సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ రోజు ముగించాలని ఇదివరకే నిర్ణయించారు. కోవిడ్ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. రెండేళ్లు కరోనా విజృంభణ కారణంగా భక్తుల రాకపై ఆంక్షలు విధించారు.. కానీ ఈసారి కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు ఎత్తివేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)