మంచు ముగ్గురు సైనికులను పొట్టన పెట్టుకుంది. పెట్రోలింగ్ చేస్తుండగా ముగ్గురు సైనికులు లోయలో పడి కన్నుమూశారు. కశ్మీర్లో ఈ ఘటన జరిగింది. కుప్వారా జిల్లాలోని మాచల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి విధుల్లో ఉన్న సైనికులు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు. పేరుకుపోయిన మంచు వల్ల ముందు ఏం ఉన్నదో తెలియకపోవడం వల్లే చినార్ క్రాప్స్ కు చెందిన జేసీఏతో పాటు మరోఇద్దరు సైనికులు కాలుజారి లోయలో పడిపోయారని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.