సమావేశాల ప్రారంభం రోజున పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటుచోటుకుంది. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ లోపలకు వెళ్తుండగా బయటకు వస్తున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఆమెను మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన ములాయం కుశల ప్రశ్నలు వేశారు. కొన్నినిమిషాల పాటు ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అక్కడున్న మీడియా ప్రతినిధులు కొందరు ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించారు. యూపీ ఎన్నికలవేళ జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది.