క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు కర్నాటకకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ. 90 ఏళ్ల వయసులో కూడా రాజకీయాలు చేయలేనని..అందుకే వీడుతున్నట్టు ప్రకటించారు. రాజకీయాల్లోనే కాదు ఇకపై బహిరంగ సమావేశాలు, ఇతరత్రా కార్యక్రమాల్లోనూ కనిపించబోనన్నారు.సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన… కర్నాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్రమంత్రిగా, గవర్నర్ గా కూడా పనిచేశారు. కొన్నేళ్లక్రితం బీజేపీలో చేరారు. అయితే పార్టీ తనను నిర్లక్ష్యం చేసిందన్న వార్తల్లో వాస్తవం లేదన్న కృష్ణ…వయసురీత్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.