‘జై హింద్…’
ఉద్యమకారులు కలిసినప్పుడు ఒకరినొకరు పలకరింపుగా జైహింద్ అనుకోవాలని మొదట చెప్పినవారు నేతాజీ సుభాష్ చంద్రబోస్
‘వందేమాతరం…’
కోట్లాదిభారతీయుల్ని కదిలించిన, ఒక్కటి చేసిన నినాదం ఇది. బంకించంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ లో ఈ పదాన్ని వాడుతూ గేయం ఉంటుంది. తల్లిభారతిని కీర్తిస్తూ, వందనం చేస్తూ సాగుతుంది వందేమాతరం. ఈ నినాదం బ్రిటీష్ పాలకుల్ని పరుగులు పెట్టించిందని చెప్పవచ్చు. వందేమాతరం అంటూ ఉరికొయ్యను ముద్దాడారు ఎందరో వీరులు .
‘నువ్వునాకు నీ రక్తాన్ని ఇవ్వు, నేను నీకు స్వాతంత్ర్యం ఇస్తాను’ …
అన్న సుభాష్ చంద్రబోస్ మాట నాడు ఎందరో యువకుల్ని స్వరాజ్యసంగ్రామం వైపు అడుగులు వేయించింది.
‘స్వాతంత్ర్యం నా జన్మహక్కు’ …
అన్న బాలగంగాధర్ తిలక్ నినాదం కోట్లాదిమందిలో స్వాతంత్ర్యేచ్ఛను రగిలించింది.
‘ఇంక్విలాబ్ జిందాబాద్…’
అతిచిన్నవయసులోనే ఉరికంబం ఎక్కిన యువ యోద్ధ భగత్ సింగ్ నోటంట మొదట వచ్చిన ‘ఇంక్విలాబ్ జిందాబాద్…’ స్వాతంత్ర్య సమరనినాదమైంది.