1857లో దేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న 282 మంది భారతీయ సైనికుల అస్థిపంజరాలు అమృత్సర్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో లభ్యమయ్యాయని పంజాబ్ యూనివర్సిటీ ఆంత్రోపాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జేఎస్ సెహ్రావత్ తెలిపారు.
పందికొవ్వు, ఆవుకొవ్వు పూసిన కాట్రిడ్జ్ లను ఉపయోగించడంపై సైనికులు తిరుగుబాటు చేశారని చెప్పారు.
https://twitter.com/ANI/status/1524257970984431618?s=20&t=1HGR8wenvzLq2Tx1Pf4koQ
“ఈ అస్థిపంజరాలు 1857లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో మొదటి స్వాతంత్య్ర పోరాటంలో మరణించిన 282 మంది భారతీయ సైనికులకు చెందినవి. పంజాబ్లోని అమృత్సర్ సమీపంలోని అజ్నాలాలో ఒక మతపరమైన నిర్మాణం క్రింద ఉన్న ఒక బావి నుంచి ఇవి త్రవ్వబడ్డాయి. ఈ సైనికులు పందికొవ్వు, ఆవుకొవ్వు పూసిన కాట్రిడ్జ్ ల వాడకానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని అధ్యయనాల్లో వెల్లడైంది. నాణేలు, పతకాలు, DNA అధ్యయనం, మౌళిక విశ్లేషణ, రేడియో-కార్బన్ డేటింగ్ అన్నీ ఒకే విధంగా సూచించాయి” అని అసిస్టెంట్ ప్రొఫెసర్ సెహ్రావత్ చెప్పారు.