దేశంలో ఆరో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ను ప్రధాని మోదీ ఈనెల 11న ప్రారంభించనున్నారు. ఛత్తీస్ ఘడ్ బిలాస్ పూర్ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ నగరాల మధ్య వారంలో 6 రోజుల పాటు వందేభారత్ తిరగనుంది.
ఆ రెండు నగరాల మధ్య కేవలం ఐదున్నర గంటల్లో రైలు ప్రయాణం సాగనుంది. మధ్యలో రాయ్ పూర్, దుర్గ్, గోండియాల్లో ఆగుతుంది. ఇక వచ్చేఏడాది సికింద్రాబాద్-విజయవాడ నగరాల మధ్య వందేభారత్ రైలును ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తోంది భారతీయ రైల్వే. ఇక ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ బేస్ డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ సమాచార వ్యవస్థ, వైఫై, సౌకర్యవంతమైన సీట్లతో వచ్చే ఏడాది ఆగస్టులోగా 75 వందేభారత్ రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది.