బీజేపీ కార్యకర్తలే లక్ష్యంగా బాంబు దాడి.. ఆరుగురికి గాయాలు.
https://twitter.com/ANI/status/1368026891693686785
వెస్ట్ బెంగాల్లో టీఎంసీ వర్కర్లు మరోసారి రెచ్చిపోయారు. బీజేపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. క్రూడ్ బాంబులతో దాడులు చేసి హతమార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని.. స్థానిక బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దక్షిణ 24 పరగణ జిల్లాలోని రాంపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి క్రూడ్ బాంబులు పేలాయి. ఈ పేలుళ్ల ధాటికి బీజేపీకి చెందిన ఆరుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. టీఎంసీకి చెందిన కార్యకర్తలే తమపై క్రూడ్ బాంబులు విసిరారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా తమపై దాడికి దిగారని బీజేపీ నేతలు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సంఘటనతో స్థానికంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.