ఈరోజుల్లో ఫొటోషూట్ కామన్ అయిపోయింది..ఇంట్లో ఏ వేడుక జరిగినా ఫొటో షూట్ ఉండాల్సిందే. అయితే ఓ మాతృమూర్తి తన ఇద్దరు కుమారులకు శివాజీ, శంబాజీ గెటప్ వేసి… ముస్తాబుచేసి తీయించిన ఫొటో షూట్ ఆకట్టుకుంటోంది. అంతేకాదు… తాను జిజియా బాయి అయిపోయింది. ఇప్పుడా ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి..