1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా గోవా, డామన్ & డయ్యూ లకు మాత్రం స్వేచ్చ లభించలేదు. గోవా రాష్ట్రాన్ని పోర్చుగీసులు ఆక్రమించి కొన్ని శతాబ్ధాలుగా అక్కడే పాతుకు పోయారు. గోవాను భారతదేశానికి ఇవ్వడానికి పోర్చుగీసు ప్రభుత్వం నిరాక రించడంతో దశలవారీ ప్రయత్నాల అనంతరం భారత ఆర్మీ 1961 డిసెంబర్ 18న వారిపై యుద్ధాన్ని ప్రకటించింది. దీనికి భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ అనే పేరును పెట్టింది. దీనిలో భాగంగా దాదాపు 36 గంటల పాటూ భారత వాయు, నావికా, భద్రతా దళాలు గోవాను ముట్టడించి 451 ఏళ్ల పోర్చుగీసుల పాలన నుంచి ఈ భారత భూభాగానికి డిశంబర్ 19 న విముక్తి కల్పించాయి. ఈ యుధ్ధంలో 22మంది భారతీయ జవానులు అమరులై 31 మంది పోర్చుగీసు సైనికులను హతం చేసి 4668మంది పోర్చుగీసు సైనికులను బందీలుగా పట్టుకొని విజయం సాధించారు. దీంతో గోవా, డామన్ & డయ్యూ భారత్ లో అంతర్భాగమైనాయి. అప్పటినుండి ప్రతి ఏటా డిసెంబర్ 19న గోవా విముక్తి దినోత్సవాన్ని (గోవా లిబరేషన్ డే)ను ఘనంగా నిర్వహిస్తు న్నారు.* కెకెవి నాయుడు
గోవా లిబరేషన్ కు జరిగిన పోరాటాల పరంపర మనం ఓ సారి అవలోకనం చేద్దాం.
గోవా ప్రజలను పోర్చుగీసు వారు బానిసత్వం లో ఉంచి నరక యాతనలు పెట్టేవారు అలాంటి సమయంలో ఒక సత్యాగ్రహం మొదలయ్యింది. 1954 జూన్ నెలలో కొంత మంది ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అలాగే అనేక మంది దేశ భక్తులు ఎలాగైనా సరే గోవాని పోర్చుగీసు దాస్య శృంకలాల నుండి విముక్తి సాధించడానికి ఒక కవాతు నిర్వహించాలి అని పిలుపు నిచ్చారు. ప్రతిస్పందనగా అనేకమంది దేశ భక్తులు గోవాకి పయన మయ్యారు.
అదే సమయంలో మన తెలుగు వాడు ఆంధ్రుడు కృష్ణాజిల్లా ఉయ్యూరు కి చెందిన సూరి సీతారం అనే నవ యవ్వన యువ కిషోరం గోవాకి తన మిత్రులు 15 మందితో కలిసి బయలుదేరాడు. ఆనాడు విజయవాడ నుండి గోవాకి ఒక రైలు ఉండేది ఆ రైలులో దేశ భక్తి గీతాలు పాడుకుంటూ తన మిత్రులందరినీ మన సూరి సీతారం నాయకుడిగా ఉత్తేజ పరచాడు. కనీసం ఆ 15 మంది యువకులలో ఏ ఒక్కరూ కూడా తమ తల్లితండ్రులకు మేమూ గోవా విముక్తికై వెళ్తున్నాం అనే సమాచారం కూడా ఇవ్వకుండా బయలుదేరారు. అదీ దేశభక్తి అంటే..
గోవాలో సత్యాగ్రహం మొదలయ్యింది అప్పటికే ఎక్కడి కక్కడ పోర్చూగీస్ సైన్యం దేశ భక్తులను చల్లా చెదురు చేసే పనిలో బస్సులను రైళ్ళను గోవా వైపు రాకుండా ఆపేశారు, అలాగే గోవా ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు, ఆ దుర్మార్గానికి జడిసి కొంతమంది మద్యలోనే ఆగిపోయారు కానీ మన సూరి సీతారం తన మిత్రులు మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు మధ్యలో కొంత మంది దేశ భక్తులు జతయ్యారు కానీ రైళ్ళు ఆపడం వలన రైలు పట్టాలనే మార్గంగా ఎంచుకుని ఒక నూట యాబై మంది పైబడి యువకులు పట్టాల మీద వేగంగా నడుస్తూ ఆగష్ట్ 15 కి గోవా దగ్గరకు చేరుకున్నారు.
రైళ్ళ పట్టాల వెంట నడిచి కాళ్ళు పగిలి అలగే అలసటకు గురైన సూరి సీతారం మిత్ర బృందం ఒకచోట పోర్చుగీస్ సైన్యం కంటపడ్డారు. వాళ్ళు వెంటనే తుపాకులతో కాల్చడం మొదలు పెట్టారు అప్పటి వరకు ఉన్న చాలా మంది మిత్రులు భయభ్రాంతికి గురై పక్కకు వెళ్ళిపోయారు దాక్కుకున్నారు, కానీ వారి కాల్పులను నిరసిస్తూ చాతీని చూపిస్తూ మన సూరి ముందు కెళ్ళాడు కాని ఆ దుర్మార్గులు తూటా మీద తూటా ఎక్కుపెట్టి సీతారాం గుండెల్లో పదుల్లో బుల్లెట్లు కాల్చారు తల్లితండ్రులకు చెప్పకుండా పయనమైన మన యువకిషోరం నేల కొరిగాడు అప్పటికే గోవాలో 150 మంది కనీసం పోర్చుగీస్ వాళ్ళ చేత చంపబడ్డారు, జలియన్ వాలా భాగ్ మారణాకాండ తరువాత స్వాతంత్య్రం కోసం అత్యధిక మంది చనిపోవడం ఇదే కానీ పోర్చుగీస్ వాళ్ళు కేవలం 20 మంది మాత్రమే చనిపోయారు అని లెక్కలు చెప్పారు.
నేల కొరిగిన మన సూరి సీతారం శవం మనవాళ్ళకి దొరికితే పెద్ద దావాళంలా ఉధ్యమం పెరిగి పోతుంది అనే భయంతో పోర్చిగీసు పోలీసులు సూరి సీతారం శవంను కిరోసిన్ తో కాల్చి కనీసం శరీరం కూడా దొరకకుండా చేశారు. ఇది కళ్ళారా చూసిన సీతారం మిత్రులు తండ్రి సూరి శోభనా చలపతికి అలాగే గోవా స్వాతంత్య్ర విముక్తి సమితికి వెల్లడించారు అలాగే మిత్రులు ఉయ్యూరు లో సూరి జ్ఞాపకార్దం సూరి ట్రస్టు స్దాపించి సూరి విగ్రహం కట్టించారు. అదే విధంగా గోవా స్వాతంత్య్ర వీరుల మ్యూజియంలో మరియు ఎర్రకొటలో కూడా సూరి చిత్రపటం ఉంది.
సీతారం ఉయ్యురులో జులై 10 1937 లో జన్మించాడు, 1955 ఆగష్ట్ 15 న గోవాలో అమరు డయ్యాడు. కేవలం 18 సంవత్స రాల వయస్సులో దేశం కోసం అమరులయ్యిన అతికొద్ది మందిలో ఒకరు సూరి సీతారం. ఇలాంటి గొప్ప వీరులు భారతదేశ స్వాతంత్య్ర విముక్తి కోసం పోరాడారు . ఇలాంటి అజ్ఞాత స్వాతంత్య్ర వీరుల గురించి తెలుసు కుందాం, వారిని సదా స్మరించుకుందాం.
*పలు పోరాటాల అనంతరం చివరగా 1961 డిశంబర్ 19 యుధ్ధం ద్వారా గోవా విముక్తి జరిగింది నేడు భారతదేశంలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానమైన గోవాకు ఏడాది పొడవునా దేశ విదేశీ పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. ప్రతి సీజన్ కూడా ఇక్కడ పర్యాటకులకు సరికొత్త అనుభవాలను అందిస్తుంది. ఏడాదిలో డిసెంబర్ మాసంలో గోవా పర్యటన ప్రత్యేకం. ఈ నెలలో గోవా పర్యటనకు వచ్చే టూరిస్టుల సంఖ్య ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతూనే ఉంది. వేసవికాలం, వర్షాకాలం కంటే శీతాకాలంలో ఇక్కడ ధరలు కొంచెం అధికంగా ఉంటాయి. కానీ మనకు ప్రతీదీ ఎంతో ఉత్తమంగా లభిస్తుంది. ప్రశాంతమైన, చల్లని వాతావరణం మధ్య అన్ని రకాల వాటర్ స్పోర్ట్స్ ను ఎంజాయ్ చేయవచ్చు. కార్ లేదా బైక్ లను అద్దెకు తీసుకుని స్నేహితులతో విహరించడం, నైట్ షాపింగ్, రెస్టారెంట్ లలో రుచికరమైన భోజనం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతులు.
Courtesy :- KKV Nayudu.