శ్రీరామ నవమి శోభాయాత్రం సందర్భంగా గుజరాత్ వడోదరలో చెలరేగిన అల్లర్లపై దర్యాప్తుకోసం ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. క్రైమ్ విభాగం డీసీపీ సారథ్యంలోని ఐదుగురు సభ్యులతో కూడిన పోలీసు టీమ్ ఈ సిట్లో ఉంటుంది. వడోదర సిటీ కుంభద్వార-హాథిఖానా ప్రాంతంలో మార్చి 30 న శోభాయాత్ర సందర్భంగా రాళ్లురువ్వుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తం నెలకొంది. వీడియో ఫుటేజ్ ఆధారంగా 23 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. అందర్నీ స్థానిక కోర్టు పోలీసు రిమాండ్కు పంపగా, 19 మందిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. అల్లర్లు విస్తరించకుండా చూసేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు 400 మంది సిబ్బందితో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించినట్టు జాయింట్ సీపీ మనోజ్ నినామా తెలిపారు.