
గత నెల జరిగిన నుపూర్ శర్మ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా అంత వైరల్ కావడానికి ఆల్ట్ న్యూస్ వెబ్ పోర్టల్ సహ వ్యవస్థాపకుడు జుబైర్ అన్నవాడు కారణం అని సోషల్ మీడియాలో విపరీతంగా వచ్చింది. కారణం? ఆమె చెప్పిన మాటలు ఏమిటో, ఆమెని ఎవరు ఎలా రెచ్చగొడితే ఆ మాటలు అన్నదో చెప్పకుండా కేవలం ఆమె మత దూషణ చేసింది అని మాత్రమే ట్వీట్స్ పెట్టి లక్షల్లో ఉన్న వాడి ట్విట్టర్ ఫాలోవర్స్ ద్వారా విపరీతంగా వైరల్ చేసి దేశంలో అలజడికి విదేశాలతో దౌత్య సంబంధాల ఘర్షణ రావడానికి కారకుడు అయ్యాడు. వీడి సమాచారం ఆధారంగా అల్ జజీరా టివి కూడా కథనాలు ప్రసారం చేసి ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టింది.
ప్రవక్త ముహమ్మద్ను దూషించడం తప్పు అని చెప్పి, రాళ్ళ మూకలను సమర్ధించిన ఈ మనిషి జుబైర్ హిందూ దేవుళ్లను గతంలో దూషించాడు. హిందువుల విశ్వాసాలను అపహాస్యం చేస్తూ మొహమ్మద్ జుబైర్ గతంలో చేసిన ట్వీట్లను, ఫేస్ బుక్ పోస్టుల ఆధారంగా ఇప్పుడు వీడి మీద కూడా కేసులు పెట్టారు.
సరే…ఇక అసలు విషయానికి వద్దాం…
*ఇంతకీ అసలు జుబైర్ ఎవడు?
* అసలు నిజంగా భారతీయుడేనా?
లేక ఏ శత్రు దేశపు మనిషా? ఎందుకంటే
వీడి గురించి 2012 ముందు సమాచారం
ఏదీ దొరకడం లేదు అని వార్తలు.
*నేను జర్నలిస్ట్ కాదు అని వాడు స్వయంగా
ట్వీట్ పెట్టి చెప్పినా, ఒక జర్నలిస్ట్ ని మోడీ
ప్రభుత్వం అన్యాయం గా అరెస్ట్ చేసింది
అని దేనికి గగ్గోలు?
*వీడిని అరెస్ట్ చేస్తే దేశంలో ప్రతిపక్ష నేతలు,
ప్రముఖ అర్బన్ నక్సల్ లాయర్లు,
మీడియా ప్రముఖులు మాత్రమే కాక
అమెరికా, జర్మనీ దేశాలు మరియు
యూఎన్ కూడా ఎందుకు స్పందించాయి?
ఈ జుబైర్ గురించి ఈ ఆశ్చర్యకర విశేషాలు చదవండి :
1. 2012కి ముందు అతని గురించి ఏజెన్సీలకు ఎలాంటి సమాచారం లేదు.
2. అతను HCL, సిస్కో వంటి MNCలతో పని చేశానని చెప్పుకున్నాడు. అయితే ఏ పత్రాన్ని అతను సాక్ష్యంగా చూపలేకపోయాడని వార్తలు

3. న్యూస్ లాండ్రీ, స్క్రోల్ మరియు ఇతరులు అతని వయస్సును వేరే వేరేగా కోట్ చేసారు. అది 37సం. ల నుండి 40 సం. ల మధ్య ఉంది.
అంతే కాదు ఈ జుబైర్ 2020 లో ఒక ట్వీట్ పెడుతూ దానిలో తన వయసు 25 సం.లుగా పేర్కొన్నాడు..అంటే 1995 లో పుట్టినట్లు కదా? మరి ఒక్కో చోట ఒక్కొక్క వయసు ఎందుకు వస్తోంది?

4. ఇదే జుబైర్ మరో ట్వీట్ లో తను 2005లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ట్రై చేసాను అని చెప్పాడు? మరి 1995లో పుట్టిన వాడు 2005లో ఇంజినీరింగ్ ఎలా పూర్తి చేశాడు?

పాశ్చాత్య దేశాలకు ఇంత తక్కువ స్థాయి వ్యక్తి మహ్మద్ జుబైర్ ఎందుకు అకస్మాత్తుగా అంత ముఖ్యమైనవాడయ్యాడు?
ఇతని అరెస్టు, అతని నిధులను మరియు పరిచయాలను మన నిఘా సంస్థలు ఎంక్వైరీ చేస్తున్నాయి అని కొన్ని దేశాలు భయపడుతున్నాయా?
అర్బన్ నక్సల్స్ కేసులు వాదిస్తున్న గాన్ స్లాప్స్, ఇందిరా జైసింగ్ వంటి లాయర్లు వీడి కేసు కూడా వాదిస్తున్నారు.
ఒక్కటి మాత్రం నిజం, భారతదేశం చేతిలో పెద్ద చేప దొరికింది. విదేశీ నిధులు పొందుతున్న మిషనరీలు మరియు వామపక్షాలు సహకరించుకుంటూ భారతదేశంపై దాడికి ఎలా ప్రయత్నిస్తున్నారు? నిధుల సమీకరణ ఎలా జరుగుతోంది మొదలగు చాలా విషయాలు అర్థం చేసుకోవడానికి వీడిపై ఎంక్విరీ సహాయపడుతుంది.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే కాబోలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వీడిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టడానికి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (SIT) ని నియమించింది.
యూపీ లో హత్రాస్ కోర్టు వీడిని 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ కి పంపించింది.
…..చాడా శాస్త్రి…..