టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. లీకేజీతో సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చిన అందరినీ ఒక్కొక్కరిగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేశారు. ఇక తాజాగా మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పేరు సైతం తెరమీదకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికీ సిట్ నోటీసులు పంపింది. 2016 గ్రూప్ 1 పేపర్ కూడా లీకైందని, కేటీఆర్ ఆఫీస్ నుంచే వ్యవహారం మొత్తం నడిచిందని ముఖ్యంగా మంత్రి పీఏ తిరుపతి గ్రామానికి చెందిన చాలామందికి వందకు పైగా మార్కులు వచ్చాయని రేవంత్ ఆరోపణలు చేశారు. దీంతో అందుకు సంబంధించిన ఆధారాలు, వివరాలు ఇవ్వాలంటూ సిట్ రేవంత్ కు నోటీసులు పంపింది . అయితే సిట్ కు ఎలాంటి ఆధారాలు సమర్పించబోమని రేవంత్ స్పష్టం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తేనే ఆధారాలిస్తామన్నారు. ఇక తన భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆరోపిస్తూ ఇదే కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి భార్య సుచరిత హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తకు వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆమె కోర్టును కోరారు. అయితే కస్టడీకి తీసుకునేముందే వైద్యపరీక్షలు నిర్వహించామని, కస్టడీ ముగిసిన తరువాత కూడా మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని
పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు ఇంకేమైనా సందేహాలు, సమస్యలు ఉంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది.
పేపర్ లీకేజీ వ్యవహారంలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు – ఆరోపణలపై ఆధారాలివ్వాలని రేవంత్ కు సిట్ నోటీసులు
పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు ఇంకేమైనా సందేహాలు, సమస్యలు ఉంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది.
Share: