మద్యం కేసులో అరెస్టైన డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు రౌస్ అవెన్యూ కోర్టులో ఆయన పిటిషన్ వేశారు. శనివారం ఆయన పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. గత ఆదివారం సీబీఐ సిసోడియాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం కోర్టులో హాజరు పర్చగా ఐదురోజుల కస్టడీకి అప్పగించింది. ఆయనకు విధించిన కస్టడి శనివారంతో ముగియనుంది. ముందు బెయిల్ కోసంఆయన సుప్రీంను ఆశ్రయించగా..పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది.