ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. తదుపరి విచారణను కోర్టు మార్చి 4కు వాయిదా వేసింది. అప్పటివరకు ఆయన సీబీఐ కస్టడీలో ఉంటారు. లిక్కర్ స్కాంలో సీబీఐ ఆయన్ని ఆదివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. ఇవాళ ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ లిక్కర్ స్కాంలో ఆయన పాత్రను కోర్టుకు వివరించింది. దర్యాప్తు కోసం ఐదు రోజుల కస్టడీకి కోరింది. తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని.. ఈ మధ్య కాలంలోఆయన అనేక ఫోన్లు మార్చారనీ తెలిపింది.ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన వివరాలు, ఆయనపై ఆరోపణలు, పాత్ర, ప్రత్యర్థుల ఆరోపణలు, సాక్ష్యులు చెప్పిన వివరాలపై ఆయన్ని 8 గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ అనంతరం ఆయన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అటు తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని…సీబీఐ పిలిచినప్పుడల్లా విచారణకు హాజరవుతానని అందువల్ల తనకు బెయిల్ ఇవ్వాలన్న సిసోడియా విజ్ఞప్తినీ కోర్టు తోసిపుచ్చింది. ఇక అటు సిసోడియా అరెస్ట్ ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆప్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి, పలు రాజకీయ పార్టీని ఆయన అరెస్ట్ ను నిరసిస్తూ సంఘీభావం తెలిపాయి.
https://twitter.com/ANI/status/1630174604613550081?s=20