మద్యం కేసులో అరెస్టైన డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. మరో రెండు రోజుల కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ పై విచారణను ఈనెల పదోతేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. మద్యం స్కాంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ సీబీఐ గత వారం ఆయన్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. కోర్టు విధించిన 5 రోజుల కస్టడీ నేటితో ముగియడంతో ఆయన్ని ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణకు సిసోడియా సహకరించడం లేదని అందువల్ల మరో మూడురోజుల కస్టడీ పొడిగించాలనిసీబీఐ కోర్టును కోరగా రెండు రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు న్యాయమూర్తి. మరోవైపు తన భార్య ఆరోగ్యం సరిగాలేదని..ఈ సమయంలో తాను ఆమె పక్కనే ఉండాలని అందువల్ల బెయిల్ ఇవ్వాలని కోరుతూ సిసోడియా రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
https://twitter.com/ANI/status/1631951408097546240?s=20