ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన డిల్లీ మాజీ డిప్యూటీ మంత్రి మనీష్ సిసోడియాకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.నేటితో ఐదురోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. మద్యం కుంభకణంలో ఆరోపణలపై సిసోడియాను గత నెల 26న పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.కోర్టు ఆయనకు ఐదురోజుల కస్టడీ విధించింది. మరిన్ని రోజుల కస్టడీ కోరుతూ సీబీఐ పోలీసులు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని మరో 14రోజుల కస్టడీ విధించింది న్యాయస్థానం. ఈనెల 20 వరకూ ఆయన తిహార్ జైల్లో ఉంటారు.
https://twitter.com/ANI/status/1632661643728650240?s=20