ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. 2021-22 లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయంటూ సిసోడియాను ఫిబ్రవరి 26న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తిహార్ జైల్లో ఉన్న ఆయన్నిమార్చి 9న ఈడీ అరెస్ట్ చేసింది. నాటి నుంచి బెయిల్ కోసం సిసోడియా పెట్టుకున్న అభ్యర్థనను సీబీఐ తిరస్కరిస్తూ వస్తోంది. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ధ్వంసం చేస్తారని…ఆయన తరచూ ఫోన్లు మార్చారని కోర్టుకు తెలిపారు. ఛార్జిషీటు దాఖలుకు తమకు 60 రోజుల సమయం ఉందన్న అధికారులు అప్పటివరకూ బెయిల్ ఇవ్వవద్దని గత విచారణ సందర్భంగా కోర్టుకు విన్నవించారు.
https://twitter.com/ANI/status/1641753345038897154?s=20