దక్షిణాదిన అన్ని భాషల్లోనూ పాపులర్ హీరోగా కమల్ హాసన్ కి పేరు ఉంది. వందల సినిమాల్లో హీరోగా నటించి పాపులారిటీ తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా కమల్ హాసన్ చాలా చిరపరిచితులు.
కమల్ మాదిరిగానే సింగర్ సుచిత్ర దక్షిణాది భాషల్లో పేరు తెచ్చుకున్నారు. చాలా తెలుగు సినిమాల్లో కూడా ఆమె పాటలు పాడి మెప్పించారు ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ సినిమాల్లో ఆమె ఎక్కువ గళం వినిపించారు. ఆ మధ్య కాలంలో వచ్చిన శ్రీమంతుడు, రామయ్య వస్తావయ్య, బాద్షా మిర్చి , నాయక్ వంటి సినిమాల్లో సింగర్ గా పాటలు పాడారు. అంతకుమించి సుచిత్ర లీక్స్ అనే వివాదం ద్వారా బాగా పాపులర్ అయ్యారు దీంతో ఆమె .. కెరీర్ కు బ్రేక్ చెప్పి లండన్ వెళ్లిపోయారు.
తాజాగా కమలహాసన్ నిర్వహించిన బిగ్ బాస్ తమిళ్ కార్యక్రమం ద్వారా సినిమా రంగంలోకి తిరిగి అడుగు పెట్టారు. అప్పటినుంచి కొన్ని సినిమాలు మరి కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కుముధం పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమలహాసన్ మీద తీవ్ర ఆరోపణ చేశారు. సినీ ప్రముఖులకు కమలహాసన్ పార్టీలు ఇస్తుంటారని, కానీ ఆ వంకతో కొకైన్ సరఫరా చేస్తున్నారని ఆమె ఆరోపించారు . మత్తులో మునిగిపోయిన సినీ ప్రముఖుల్ని ఇబ్బంది పెడుతుంటారని ఆమె అన్నారు.
దీని మీద బిజెపి తమిళనాడు పార్టీ స్పందించింది. సింగర్ సుచిత్ర వ్యాఖ్యలు నిజమైనట్లయితే సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది.
మరోవైపు ఇదే ఇంటర్వ్యూలో తమిళ నటులు దళపతి విజయ్ మీద , ధనుష్ ఐశ్వర్య దంపతుల మీద కూడా వివాదాస్పద ఆరోపణలు చేశారు.