కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారాన్ని బహిష్కరించాలని శిరోమణి అకాలీదళ్ (అమృత్సర్) అధినేత సిమ్రంజిత్ సింగ్ మాన్ పిలుపునిచ్చారు. పంజాబ్ లోని సంగ్రూర్ కు చెందిన SAD ఎంపీ తిరంగ ప్రచారాన్ని బహిష్కరించాలని ప్రజలను కోరడం ద్వారా వివాదాన్ని లేవనెత్తారు. ఆగస్టు 14-15 తేదీల్లో ఇళ్లు, కార్యాలయాల్లో నిషాన్ సాహిబ్ ను ఎగురవేయాలని ప్రజల్ని అభ్యర్థించారు. సిక్కులు స్వతంత్రులని.. సిక్కులు భిన్నమైన కమ్యూనిటీ అని మన మధ్య లేని దీప్ సిద్ధూ చెప్పారని సిమ్రంజిత్ సింగ్ త్రివర్ణ పతాకాన్ని బహిష్కరిస్తూ చెప్పారు. భారత బలగాలను ‘శత్రు’ శక్తులుగా వర్ణించారు. జర్నైల్ సింగ్ భింద్రన్వాలే (హతమైన ఖలిస్తాన్ ఉగ్రవాది) శత్రు శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందాడని అన్నారు.
సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఒక వీడియో సందేశంలో పంజాబ్ ప్రజలను స్వాతంత్య్ర దినోత్సవం రోజు త్రివర్ణ పతాకాన్ని తగులబెట్టమని.. ఖలిస్తానీ జెండాను ఎగురవేయమని ప్రేరేపించడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.