పంజాబ్ ఎన్నికల వేళ సిక్కు సమాజానికి చెందిన ప్రముఖులు ప్రధాని మోదీని ఢిల్లీలో కలవడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ గ్రహీత బాబా బల్బీర్ సింగ్, అమృత్ సర్ డేరాబాబా సంత్ మేజర్ సింగ్, మహంత్ కరంజిత్ సింగ్ సహా పలువురు ఆయనతో భేటీ అయ్యారు. ప్రధాని వారిని సాదరంగా ఆహ్వానించారు. వారు ఆయన్ని సత్కరించారు. మోదీతో సిక్కు ప్రముఖుల భేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)