యూపీలోని నేపాల్ సరిహద్దు వెంబడి మసీదులు, మదర్సాలు పెరగడంపై సశస్త్ర సీమా బల్ ఆందోళన వ్యక్తం చేసింది. సరిహద్దు చుట్టుపక్కల 15 కిలోమీటర్ల పరిధిలో వందలాదిగా మసీదులు వెలిశాయి. యూపీ, నేపాల్ తో 570 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంటుంది. రెండేళ్లలో బోర్డర్లో మసీదుల సంఖ్య విపరీతంగా పెరిగిందని నిఘా వర్గాల నివేదిక. ప్రభుత్వ ఆదేశంతో సరిహద్దులో మదర్సాలపై పోలీసులు నిఘా వేయడంతో వాస్తవాలు బయటకువస్తున్నాయి. సరిహద్దు వెంబడి కొత్తగా నిర్మించిన 257 మసీదులకు దవాత్ ఎ ఇస్లామిస్ట్ వంటి ఉగ్రవాద సంస్థల నుంచి పెద్దమొత్తంలో నిధులు అందుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
2018లో యూపీ-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో 738 మసీదులు ఉంటే… 2021 నాటికి వెయ్యికి పెరిగాయి. 2018లో 500 ఉన్న మదర్సాల సంఖ్య 2021 నాటికి 645 కి పెరిగాయని అధికారులు గుర్తించారు. భారత్ -నేపాల్ సరిహద్దు, ఉత్తరాఖండ్-యూపీ సరిహద్దులో పదేళ్లలో 4 వందల మసీదులు, మదర్సాలు పెరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ముస్లిం జనాభా కూడా గణనీయంగా పెరుగుతోందని అర్థం. యూపీలో ముఖ్యంగా బెహ్రాయిచ్, బస్తీ, గోరఖ్ పూర్ ప్రాంతాల్లో ఇటీవల లెక్కలేనన్ని మసీదులు, మదర్సాలు నిర్మించారు. ఆక్కడ ముస్లింల జనాభా పెరిగింది. మహారాజ్గంజ్, సిద్ధార్థ్ నగర్, బల్రాంపూర్, బహ్రైచ్, శ్రావస్తి, పిలిభిత్ , ఖిరి జిల్లాల వ్యాప్తంగా కూడా గణనీయంగా పెరిగాయి. మొత్తంగా ఈ మూడేళ్లలో 26 శాతం కొత్తవి వెలిశాయని తేలింగి. అదే సమయంలో ఆయాప్రాంతాల్లో దందాలు, సెటిల్మెంట్లు, భారత్ కు నకిలీ కరెన్సీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా కూడా పెరిగాయి.
ఇక సిద్ధార్థనగర్ ప్రాంతంలో గత 20 ఏళ్లుగా మసీదులు, మదర్సాల సంఖ్య నాలుగురెట్లు పెరిగింది. ప్రస్తుతం అక్కడే 597 కొత్త మసీదుల నిర్మాణం జరగ్గా… 145 కట్టడాలను ఎలాంటి రికార్డులు లేవు. ఈ మసీదులు, మదర్సాలకు పాకిస్తాన్ సహా… దుబాయ్ తదితర గల్ఫ్ దేశాలనుంచి నిధులు అందుతున్నాయని అధికారులు అనుమానంవ్యక్తం చేస్తున్నారు.