సంచలనం రేపిన శ్రద్ధావాకర్ హత్య కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. ఆమెను అతి కిరాతకంగా పొట్టనపెట్టుకున్న ఆప్తాబ్ పూనావాలా చంపిన అనంతరం రుజువులు లేకుండా మాయం చేశాడనే ఆరోపణలకు ఆధారాలు లభించాయి. అందుకు ప్రాసిక్యూషన్ ఆధారాలు సమర్పించినందున ఇక ఆఫ్తాబ్ పై విచారణ ప్రారంభించవచ్చని ఢిల్లీ అదనపు సెషన్స్ జడ్జి మనీషా ఖురానా స్పష్టం చేశారు. ఈ మేరకు అతనిపై హత్య, ఆధారాల చెరిపివేత అభియోగాలు నమోదు చేశారు. గతేడాది మే 18న ఆఫ్తాబ్…శ్రద్ధా వాకర్ గొంతునులిమి చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఢిల్లీ శివారు ప్రాంతాల్లో విసిరేశాడు. మూడువారాల పాటు ఫ్రిజ్ లో భద్రపరిచి వీలు చూసుకుని ఆపనిచేశాడు. హత్యోదంతం వెలుగులోకి వచ్చాక పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతను చెప్పిన ఆనవాళ్ల ప్రకారం వెదగ్గా…పలుచోట్లనుంచి ఆమె కేశాలు, ఎముకలు, దవడభాగం లభ్యమయ్యాయి. అయితే తన కుమార్తెను చంపిన వాడిని ఉరితీయాలని శ్రద్ధ తండ్రి వికాస్ వాకర్ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆమె అవశేషాలను అప్పగిస్తే అంత్యక్రియలు జరిపిస్తామనీ వేడుతున్నారు. ఆయన విజ్ఞప్తిపై విచారణ జరిపిన న్యాయస్థానం…కేసును మే 22కు వాయిదా వేసింది.
Shraddha Walkar case: Aftab Poonawala charged with murder, disappearance of evidence
Read @ANI Story | https://t.co/AFrsxPiIjM#ShraddhaWalkar #AftabPoonawala #Murder pic.twitter.com/wTkWhWvfsF
— ANI Digital (@ani_digital) May 9, 2023