యావత్ భారత దేశం చూపు నేడు నందిగ్రామ్ వైపే ఉందన్నారు బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి. వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న రెండో దశ ఎన్నికల్లో నందిగ్రామ్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇక్కడి నుంచే టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీలో ఉన్నారు. ఆమెకు ప్రత్యర్ధిగా సువేందు అధికారి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన నందిగ్రామ్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లను సందర్శించారు. ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఓటర్లంతా పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓటింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. బెంగాల్ ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశం అంతా నందిగ్రామ్ వైపే చూస్తుందని.. కాబట్టి పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
https://twitter.com/ANI/status/1377449306748162049