ఆసక్తికరమైన, సందేశాత్మక ట్వీట్లతో ఆకట్టుకునే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజా ట్వీట్ ఆకట్టుకుంటోంది. ఏళ్ల తరబడి నీళ్లు లేకున్నా, పూర్తిగా ఎండిపోయినా , తడి తగిలితే చాలు మళ్లీ ప్రాణం పోసుకునే ఓ మొక్క గురించి ఆయన వీడియోను జత చేస్తూ ట్వీట్ చేశారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వ్యాపారులు..ఇలా మనసు దిటవు చేసుకుని నిలదొక్కుకోవాలని…ఈ మొక్క ద్వారా స్ఫూర్తి పొందాలని, వ్యాపార వ్యూహాల్లో సంయమనంతో ఉండాలని రాసుకొచ్చారు. 15 సెకండ్ల నిడివితో ఉన్న ఈ వీడియోలో ఉన్న మొక్క
సెలగినెల్లా లెపిడోఫైల్లా . ఇది పిండి ముద్దలా ఉంది. పూర్తిగా ఎండిపోయి ఉంది. దీనిపై కొద్దిగా నీరు వేసేసరికి క్షణాల్లోనే విచ్చుకుంది. దీని ఆకులు వెనువెంటనే తెరుచుకున్నాయి. అంతకుముందు పైకి కనిపించని పచ్చదనం నీరు పోసిన తర్వాత కనిపించింది. ఈ రిసరక్షన్ ప్లాంట్ (పునర్జీవించే మొక్క) పేరు సెలగినెల్లా లెపిడోఫైల్లా.
ఈ వీడియోను షేర్ చేస్తూ ఇది అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉందన్నారు ఆనంద్. మొక్కతో పోలుస్తూ ఎన్నో విషయాలు చెప్తూ ఉత్తేజరపరిచే సందేశాన్ని అందించిన మహీంద్రాను నెటిజన్లు అభినందిస్తున్నారు.
https://twitter.com/anandmahindra/status/1600872863199739905?s=20&t=e0VpIxrPDez9oPMoCD1iTg